Telangana Assembly elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టనున్నారు. ఇవాళ్టి నుంచి అగ్రనేతల వరుస పర్యటనలు ఉండేలా బీజేపీ ప్రచార షెడ్యూల్ను ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మ.12:35కు బేగంపేటకు చేరుకొని.. ఒంటిగంటకు జనగామ సభలో పాల్గొంటారు అమిత్ షా. మధ్యాహ్నం 3 గంటలకు కోరుట్ల బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం 5:30 గంటలకి ఉప్పల్లో అమిత్షా రోడ్ షో చేస్తారు. మళ్లీ రాత్రికి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు. అయితే రెండు రోజుల క్రితమే తెలంగాణకు వచ్చిన అమిత్షా బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సూర్యాపేట, వరంగల్ బహిరంగ సభల్లో పాల్గొన్న అమిత్ షా క్యాడర్లో జోష్ నింపారు.
Amit Shah: అధికారమే లక్ష్యంగా స్పీడు పెంచిన కాషాయ దళం.. తెలంగాణకు బీజేపీ అగ్రనేతల రాక..
Hyderabad :


